నర్సంపేట/నర్సంపేటరూరల్/శాయంపేట/గీసుగొండ, మే 26: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో బుధవారం నర్సంపేటలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎంసీపీఐయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి గాధగోని రవి, ఏకేఎస్సీసీ జిల్లా కన్వీనర్ పెద్దారపు రమేశ్ మాట్లాడారు. ప్రధాని మోడీ ఏడేళ్ల పాలనలో రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చారని విమర్శించారు. కరోనా మహమ్మారితో లక్షలాది మంది ్రప్రాణాలు కోల్పోవడంతోపాటు కోట్లాది మందికి ఉపాధి అవకాశాలు తగ్గాయని తెలిపారు. ఈనేపథ్యలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేలా ప్రధాని మోడీ చట్టాలు తీసుకొచ్చారని విమర్శించారు. దీనిని అన్ని వర్గాలు ప్రజలు వ్యతిరేకించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎలకంటి రాజేందర్, పరికిరత్నం, ఇల్లందుల సాంబ య్య, ప్రణయ్దీప్, జనగామ కుమారస్వామి, డేగల శ్రీనివాస్, మొగిళి ప్రతాప్రెడ్డి, రాజన్న, చింతకింది శ్రీనివాస్, ఈర్ల రాంచందర్రావు, బాలనర్సయ్య, నర్సింగరావు, వెం కన్న, ప్రదీప్ పాల్గొన్నారు.
రైస్మిల్లుల వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని ఏఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మోడెం మల్లేశం అన్నారు. బుధవారం నర్సంపేట మండలంలోని మహేశ్వరం, రాజుపేట, ముత్తోజిపేట, లక్నెపల్లి, సర్వాపురం, ద్వారకపేట గ్రామాల్లోని రైసు మిల్లుల వద్ద హమాలీ కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు చింతం యాకన్న, బొల్లి శ్రీను, చందర్, కుమారస్వామి, లక్ష్మణ్, మల్లన్న, శ్రీనివాస్, రమేష్, వీరన్న, రవళి, రాజు, స్వామి, పోశాలు, గిరి, భద్రు పాల్గొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో శాయంపేట మండల కేంద్రంలో నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంద సురేశ్, మంద శ్రీకాంత్, రాకేష్, వికాస్, పవన్కుమార్, రాజ్కుమార్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా గంగదేవిపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఏఐకెఎఫ్ రాష్ట్ర నాయకుడు కుమారస్వామి ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్. మల్లికార్జున్, సంధ్య, రేణుక, రాజు, రాజయ్య, మహేశ్, రవీందర్, రాజు పాల్గొన్నారు.