మహేశ్వరం, జూలై1: పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం మహేశ్వరం మండల కేంద్రంలో రూ. 50 లక్షల నిధులతో బస్ టెర్మినల్ను, సిరిగిరిపురం గ్రామంలో పల్లె ప్రగతి పనులను మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం సిరిగిరిపురం సర్పంచ్ కాసుల సురేశ్ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాకు వెయ్యికోట్లు వెచ్చించి పల్లె ప్రగతి పనులను చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, పట్టుదలతో ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నామని చెప్పారు.
తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇచ్చి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అమయ్కుమార్, జడ్పీ చైర్పర్సన్ అనితాహరినాథ్రెడ్డి, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి దయాకర్రావు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి లతో కలిసి అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.