Musi Victim | కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న పనులతో గత రెండు సంవత్సరాల నుంచి మాకు నిద్రపట్టడం లేదంటూ మూసీ బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు. గత కేసీఆర్ ప్రభుత్వంలో మూసీ సుందరీకరణలో భాగంగా నిర్మించిన నాగోల్ STPని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ వాణి దేవి ఇతర నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా సదరు మూసీ బాధితుడు మాట్లాడుతూ.. నాకు తెలిసినప్పుడు నా భార్య 9 నెలల గర్భిణీ. అప్పటి నుంచి నాకు సరిగా నిద్రపట్టడం లేదు. అప్పుడు కూడా నా భార్య ప్రెగ్నెంట్. ఇప్పుడు కాదు.. మా ఇల్లు మేం కష్టపడి కట్టుకున్నం అంటే లేదు.. మీరిక్కడ ఉంటరా.. బయటకు వెళ్లిపోతరా.. మీ ఇల్లు కూల్చేస్తమన్నారు. ప్రెగ్నెంట్ అని చెప్పిన కూడా మమ్మల్ని రూమ్ల్లో పెట్టి తాళం వేసి బయటకు రాకుండా చేసి.. మీరు లోపే ఉండండి.. లేదంటే మూసీ పేరు మీద మీ ఇల్లు కూలగొట్టేస్తమని అన్నరు. అప్పుడు సుధీర్ అన్న మా దగ్గరకు వచ్చి మాకు భరోసా ఇచ్చిండు. మమ్మల్ని ఆదుకుంటా అని చెప్పిండు అంటూ కన్నీరు పెట్టుకున్నాడు.
నా భార్య గర్భిణి సార్ అని వేడుకున్నా కూడా ఇల్లు కూల్చేస్తామని అన్నారు. అధికారులు నన్ను మెడలు పట్టుకొని బయటకు వెళ్లగొట్టారు. సొంత ఇల్లును కూల్చేస్తామని అంటే గర్భిణీ అయిన నా భార్యను కిరాయి ఇంట్లో పెట్టిన. అన్ని అనుమతులు ఉన్నా కూడా నా ఇంటిని కూల్చేస్తామని అన్నారు. అందుకే పెట్రోల్ పోసుకున్నానంటూ కేటీఆర్ దగ్గర మూసీ బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు.
నా భార్య గర్భిణీ సార్ అని వేడుకున్నా కూడా ఇల్లు కూల్చేస్తామని అన్నారు
అధికారులు నన్ను మెడలు పట్టుకొని బయటకు వెళ్లగొట్టారు
సొంత ఇల్లును కూల్చేస్తామని అంటే గర్భిణీ అయిన నా భార్యను కిరాయి ఇంట్లో పెట్టిన
అన్ని అనుమతులు ఉన్నా కూడా నా ఇంటిని కూల్చేస్తామని అన్నారు, అందుకే పెట్రోల్… https://t.co/b212BiAIzv pic.twitter.com/W0HkJ05l3X
— Telugu Scribe (@TeluguScribe) March 5, 2026
Loco Pilot Refuses To Work | పని గంటలు ముగిశాయని.. రైలు నడిపేందుకు నిరాకరించిన లోకో పైలట్
Iran Minister Abbas Araghchi: భారత అతిథిపై దాడి చేశారు: ఇరాన్ మంత్రి అబ్బాస్
Kalyana Kanuka | ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన బీఆర్ఎస్ సర్పంచ్