హైదరాబాద్ : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) స్వర్ణగిరి(Swarnagiri) శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భువనగిరి వద్దగల ఆలయానికి చేరుకొని స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ చైర్మన్ మానేపల్లి గోపి తలసాని శ్రీనివాస్ యాదవ్కు స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు.
తదనంతరం ఆలయ ఆవరణలోని కల్యాణ మండపం, డైనింగ్ హాల్, ఆలయ పరిసరాలలోని ఇతర ప్రాంతాలను పరిశీలించారు. ఆలయ నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉందని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట యాదాద్రి జిల్లా అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడు అయోధ్య యాదవ్, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Yadagirigutta | ముక్కోటి పర్వదినం.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తజనం
Indiramma House | జాగ లేకుంటే ఇందిరమ్మ ఇల్లు లేనట్టే! మంత్రి పొంగులేటి వెల్లడి