8గంటలకే వ్యాపార దుకాణాలు బంద్
అత్యవసర సేవలకు మినహాయింపు
విస్తృతంగా పోలీసుల తనిఖీలు
నార్నూర్, ఏప్రిల్ 24: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూ మండలంలో పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ప్రజలు రోడ్లపై తిరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసర సేవలు, దవాఖానలు, మెడికల్ షాపులు మాత్రమే తెరిచి ఉంటున్నాయి. మండలంతో పాటు అన్ని గ్రామాల్లో ఎస్ఐ విజయ్కుమార్ నేతృత్వంలో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. పక్షం రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వ్యాపార దుకాణాలు రాత్రి 8గంటలలోపు మూసివేస్తున్నారు. కొద్దిరోజుల పాటు ఇదే విధానాన్ని కొనసాగిస్తే కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందనే అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.