Pet Cat | పెంపుడు జంతువులపై హద్దులు దాటిన ప్రేమ చూపిస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. బలవన్మరణాలకు పాల్పడుతూ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. ఇప్పటికే మీర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో బీఎస్సీ చదువుతున్న హిమబిందు (20) అనే యువతి గత రెండు సంవత్సరాలుగా ఎంతో ఇష్టంగా పెంచుకొని, గారాబంగా చూసుకుంటున్న పిల్లి చనిపోవడంతో ఆమె తీవ్రమనస్తాపానికి లోనై పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే.
ఈ ఘటన మరువక ముందే పిల్లి కోసం మరో యువతి ఆత్మహత్యకు పాల్పడ్డది. ఈ ఘటన హైదరాబాద్లోని అల్వాల్లో వెలుగుచూసింది. పిల్లిని ఇంట్లోకి తేవొద్దని ఎంబీబీఎస్ విద్యార్థిని శ్రేష్ఠను ఆమె తల్లి వారించింది. ఈ విషయంలో తల్లితో గొడవపడ్డ శ్రేష్ఠ ఆత్మహత్యకు పాల్పడింది. ఎంబీబీఎస్ విద్యార్థిని అయి ఉండి ఓ పెంపుడు పిల్లి విషయంలో తల్లితో గొడవపడి ప్రాణాలు తీసుకోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది.
బీఆర్ఎస్తోనే మైనారిటీల సంక్షేమం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్