Kyama Mallesh | కాంగ్రెస్ సర్కార్ పాలనలో నీకెంతా నాకెంత అని దోచుకునుడే కానీ ఇంకొకటి లేదని బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాల్లో మంత్రులున్నరు.. ఒక్క మంత్రికి కూడా ఈ ప్రాంతాన్ని, ఈ ప్రజలను సంక్షేమంగా ఉంచాలనే, నిమ్మలంగా ఉంచాలనే ఆలోచన లేదని మండిపడ్డారు.
ఏదేమన్నా.. నీకెంతా నాకెంత అని దోచుకునుడే కానీ ఇంకొకటి లేదన్నారు క్యామ మల్లేశ్. ముఖ్యమంత్రి మీకు చిత్తశుద్ది ఉంటే ఒకసారి రివ్యూ చేయ్.. ఇంకో మంత్రి, అవగాహన లేని మంత్రులు పంటలు ఎక్కువ పండినయ్ అని మాట్లాడుతున్నారు. అంటే నువ్వేమన్నా వేరే పోసి పంటలను పండించినవా..? పాత కట్టిన డ్యామ్లే.. పాత తవ్విన కాలువలే. నువ్వొచ్చినంక చేసింది ఏం లేదన్నారు.
అప్పుడు పండిన పంటలే ఇప్పుడు పండతున్నయ్. ఏమన్నా సాంకేతికంగా దిగుబడి ఎక్కువగా వస్తే 2 శాతమో.. 5 శాతమో వస్తయి. మీరింకేం ప్రాజెక్టులు కట్టలేదు.. ఏం చేయలేదు కదా. కాబట్టి ముఖ్యమంత్రి మీరు రివ్యూ పెట్టి తొందరగా ఈ రైతు సమస్యలు పరిష్కరించకపోతే రైతుల ఉసురు మీకు కూడా తాకుతదని క్యామ మల్లేశ్ హెచ్చరించారు.