MP Mallu Ravi | పోక్సో కేసులో కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ను చర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పార్టీ ప్రజాసంఘాలు, విద్యార్థులతోపాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్స్ తెరపైకి వస్తున్నాయి.
ఈ క్రమంలో పిల్లలు అప్పుడప్పుడు తప్పు చేసే అవకాశం ఉంటుంది. దానికే రాజీనామా చేయమనడం కరెక్ట్ కాదని బండి సంజయ్కు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఎంపీ మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ అతన్నేమైనా రక్షించి రాకుండా చేస్తే దాన్ని వ్యతిరేకిస్తాం.. ఆయన హోంమంత్రిగా ఉన్నాడు. అయినా కానీ ఆయన వచ్చారు సరెండర్ అయ్యారు. కేసు పెట్టారు. మళ్లీ ఇప్పుడు వేరే రకంగా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తామంటున్నారు. ఇవన్నీ చట్టం ప్రకారం జరుగుతయన్నారు.
నిన్న మొన్న బీజేపీ పార్టీ ఎట్లా ఉందో.. ఒకసారి ఆ బీజేపీ పార్టీ హైకమాండ్ను చూడాలని చెప్తున్నాం. ముగ్గురు మంత్రులు, ముగ్గురు ఎంపీలు.. పేర్లు నేను చెప్పను. మీ అందరికీ తెలుసు. వాళ్లు ఈ సమస్య రాగానే బండి సంజయ్ను సస్పెండ్ చేయాలి. రాజీనామా చేయాలి బీజేపీ ఎంపీలు చెబుతున్నారు. ఊరికెనో అది వారి పార్టీలో ఉన్న క్రమశిక్షణ. ఆ పేరుతో బండి సంజయ్ను పదవిలో నుంచి దించితే.. మేం పదవిలోకి వస్తామని చెప్పేవాళ్లే ఎక్కువయ్యారన్నారు. ఇప్పుడీ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
పిల్లల అన్నాక తప్పు చేస్తారు దానికే రాజీనామా చేయమనడం కరెక్ట్ కాదు
బండి సంజయ్ తన కొడుకును దాచిపెట్టకుండా సరెండర్ చేశాడు
– కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి pic.twitter.com/UyN8eVY6FX
— Telugu Scribe (@TeluguScribe) May 19, 2026