Bus Bhavan | ఐటీ, జీఎస్టీ అధికారులు తెలంగాణ బస్ భవన్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బస్ భవన్లో నాలుగు ఫోర్లలో ఉన్న ఆర్టీసీ కార్యాలయాల తాళాలు పగలగొట్టిన ఐటీ, జీఎస్టీ అధికారులు వారి తాళాలు వేసుకుని స్వాధీనం చేసుకున్నారు. ఇదేంటని ఆర్టీసీ సిబ్బంది అడిగితే రాష్ట్ర ప్రభుత్వం తమకు నాలుగు ఫ్లోర్లను కేటాయించిందని అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి సీఎస్ జీవో ఇచ్చారని సమాచారం.
అధికారులు బస్భవన్లోని ఏ బ్లాక్లో ఉన్న నాలుగు ఫ్లోర్లు స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు విలీనం కాకముందే బస్ భవన్, ఆర్టీసీ ఆస్తులు ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడంపై కార్మిక సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగులు, ఆర్టీసీ ఆస్తులన్నీ కార్పొరేషన్ కింద ఉన్నప్పుడు ఏ విధంగా ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నాయి.
ఈ నిర్ణయంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు రేపు పెద్ద ఎత్తున సమావేశం కావాలని నిర్ణయించినట్టు సమాచారం. రేవంత్ సర్కార్ ఆర్టీసీ ఉద్యోగులను రోడ్డున పడేసే కుట్ర చేస్తుందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.