హైదరాబాద్ : లక్క గాజులకు ప్రసిద్ది గాంచిన హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని లాడ్ బజార్ రానున్న రోజుల్లో పర్యాటక కీర్తిని పొందుతుందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ శుక్రవారం ట్వీట్ చేశారు.
కులీకుతుబ్షా ఆర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో లాడ్ బజార్ షాప్ల పునర్నిర్మాణ పనులు జరుగుతుండగా శుక్రవారం ఆ పనులను అరవింద్ కుమార్ పరిశీలించారు. లాడ్ బజార్ ముఖ భాగం ఖరారైందని, ఏడాది కాలంలో పనులు పూర్తవుతాయని తెలిపారు. ఎంతో చారిత్రాత్మక కీర్తి కలిగిన ఈ మార్కెట్ పర్యాటకులను మరింతగా ఆకర్షిస్తుందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ ట్వీట్ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా రీట్వీట్ చేశారు.
Lad Bazaar facade for shops is finalised and work is being taken up by #QQSUDA.
It will take about an year to complete. Will bring back the glory & tourists to this historic market @KTRBRS @asadowaisi pic.twitter.com/3LLBAZlPMa— Arvind Kumar (@arvindkumar_ias) February 3, 2023