45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వేయించాలి
ఎదులాపురం/నిర్మల్ టౌన్, ఏప్రిల్ 9 :రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణా భివృధ్థి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వీసీలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ఉన్నతాధికారులకు ఆదేశం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఫ్రంట్లైన్ వర్కర్స్, అధికారులు, అనధికారులకు తప్పకుండా వ్యాక్సిన్ వేయించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీపీవోలు, ఎంపీడీవోలు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాఖలో పనిచేస్తున్న మల్టీపర్పస్, పంచాయతీ వర్కర్లు, జిల్లా, మండల, గ్రామస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి, 45 ఏండ్లు నిండిన వారందరికీ టీకా తప్పనిసరిగా వేయించాలన్నారు. మండలస్థాయిలో ఎంపీడీవోలు నోడల్ అధికారులుగా వ్యవహరించాలని సూచించారు.
డీపీవో, జడ్పీ సీఈవోలు ప్రజాప్రతినిధులకు సమన్వయకర్తలుగా వ్యవహరించాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సమన్వయం చేస్తూ వ్యాక్సిన్ వేసుకునేలా చూడాలని తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డేవిడ్ మాట్లాడుతూ.. జిల్లాలో ఫ్రంట్లైన్ వర్కర్ల్కు, 45 ఏండ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ అందించేందుకు మండలస్థాయిలో టీమ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సబ్ సెంటర్, పీహెచ్సీ వారీగా వ్యాక్సిన్ పంపిణీకి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఆదిలాబాద్ జడ్పీ సీఈవో గణపతి, నిర్మల్ డీఆర్డీవో వెంకటేశ్వర్లు, ఆదిలాబాద్ డీపీవో శ్రీనివాస్, నిర్మల్ ఏపీడీ గోవింద్రావు, డీపీఎం హేమలత, ఎంపీడీవోలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
జేమ్స్ బాండ్ సినిమా పోస్టర్ వేలం..!
బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న ముగ్గురు మహిళలు అరెస్టు