వనపర్తి: అనారోగ్య బారిన పడి మెరుగైన వైద్య సేవలను అందిపుచ్చుకున్న బాధితులకు సీఎం సహాయనిధి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
ఆదివారం నియోజకవర్గ పరిధిలోని 73 మంది బాధితులకు సీఎం సహాయనిధి నుంచి విడుదలైన రూ 28.59లక్షల విలువ గల చెక్కులను తన క్యాంపు కార్యాలయంలో మంత్రి నిరంజన్రెడ్డి అందజేశారు.
అనంతరం బాధితులతో కలిసి సహపంక్తి టిఫిన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, పట్టణాధ్యక్షుడు రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి ఆవుల రమేశ్ తదితర కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.