మహబూబ్నగర్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్ లోకసభ స్థానానికి ఐదోరోజు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చే శారు. మంగళవారం పాలమూరు కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి రవినాయక్కు అభ్యర్థులు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆరుగురు ఏడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థిగా జి.రాకేశ్, స్వతంత్ర అభ్యర్థి మల్లెల హరిందర్, టి. విష్ణువర్ధన్రెడ్డి, అనీసుర్ రహమాన్, కారుకొండ శ్రీనివాసులు, హనుమేశ్ నామినేషన్ వేశారు.
నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానానికి 10 నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులుగా గాలిముడి గీత, పిల్లేల శ్రీకాంత్, పాలాది నాగరాజు, లం ద భిక్షపతి, నేడిగొండ కృష్ణయ్య, కాంగ్రెస్ అభ్యర్థి మ ల్లు రవి, అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ (ఆదార్పార్టీ) అభ్యర్థి అంబోజు రవి తరఫున దయాకర్, చిరుతైగల్ కచ్చి పార్టీ అభ్యర్థిగా భారతి దాసరి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి ఉదయ్కుమార్కు అందజేశారు. సోషల్ మీడియా స్టార్గా పేరు తెచ్చుకున్న శిరీష అలియాస్ బర్రెలక్క కూడా నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేశారు.