పాన్గల్/వడ్డేపల్లి, ఏప్రిల్ 23 : గతంలో ఎన్నడూ లేనివిధంగా భానుడు సెగలు కక్కుతున్నాడు. 20రోజులుగా ఉమ్మడి జిల్లాలో ఎండలు మాడు పగులగొడుతున్నాయి. ఉదయం 11గంటలు దాటితే ప్రజలు ఇండ్లకే పరిమితమవుతున్నారు. ఎండల తీవ్రత నుం చి ఉపశమనం పొందేందుకు కూల్డ్రింక్స్, వాటర్ బాటిల్స్, టెంకాయ నీళ్లు, మజ్జిగ, జ్యూస్ షాపులకు ఎగబడుతున్నారు. ఈక్రమంలో మంగళవారం వనపర్తి జిల్లా పాన్గల్ మండలం కేతేపల్లిలో రికార్డు స్థా యిలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాగర్కర్నూల్ జిల్లా కిష్టంపల్లిలో 43.8, మహబూబ్నగర్ జిల్లా సల్కర్పేటలో 43.6, గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలోనూ 43.5, నారాయణపేట జిల్లా ధన్వాడలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ వేడిమికి తాళలేక అల్లాడిపోయారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.