Bandi Sai bageerath case | ఓ బాలికపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ లైంగికదాడి యత్నం చేసిన ఘటనలో హైదరాబాద్ నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్లో పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) కేసు నమోదైన విషయం తెలిసిందే. బండి సాయి భగీరథ్పై కేసుకు సంబంధించి విచారణ కోసం రాష్ట్రప్రభుత్వం కూకట్పల్లి డీసీపీ (కూకట్పల్లి జోన్-సైబరాబాద్) రితిరాజ్ గైక్వాడ్ నేతృతంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది.
కాగా సిట్ బండి సాయి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో విచారణ వేగవంతం చేసింది. విచారణలో భాగంగా కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ గైక్వాడ్ పేట్ బాషీరాబాద్ పీఎస్కు చేరుకున్నారు. SHOక్యాబిన్లో డీసీపీతోపాటు ఏసీపీల సమావేశమైనట్టు సమాచారం. కాసేపట్లో పోక్సో కేసుకు సంబంధించి డీసీపీ నేతృత్వంలోని బృందం మైనర్ భాదితురాలి స్టేట్మెంట్ రికార్డ్ నమోదు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
పేట్ బాషీరాబాద్ పీఎస్కు చేరుకున్న కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ గైక్వాడ్
బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో విచారణ వేగవంతం
SHO క్యాబిన్లో డీసీపీతో పాటు ఏసీపీల మీటింగ్
కాసేపట్లో మైనర్ భాదితురాలి స్టేట్మెంట్ రికార్డ్ నమోదు చేసే అవకాశం https://t.co/GZiOZUVSIu pic.twitter.com/l6eabiPhZH
— Telugu Scribe (@TeluguScribe) May 11, 2026