హైదరాబాద్: సేఫెస్ట్ స్టేట్గా తెలంగాణ (Telangana) ఉందని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి (CS Shanthi kumari) అన్నారు. మహిళలందరూ వెనకడుగు వేయకుండా మంచి లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ వచ్చాక షీ టీమ్స్ (She Teams) వచ్చాయన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో షీ టీమ్స్ ఆధ్వర్యంలో రైజ్ అండ్ రన్ పేరుతో 5కే, 2కే రన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారు మాట్లాడుతూ.. మహిళలు అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
మహిళా అధికారి ప్రభుత్వ ఉన్నతాధికారిగా ఉండటం గర్వకారణమని డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. దేశంలోనే నంబర్ వన్ స్టేట్ తెలంగాణ అని చెప్పారు. చాలా రాష్ట్రాలు మన రాష్ట్రానికి వచ్చి ఇక్కడి విధానాలు నేర్చుకుంటున్నాయని తెలిపారు. తెలంగాణ పోలీసింగ్, షీ టీమ్స్ కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు చూసి నేర్చుకుంటున్నాయని వెల్లడించారు.
#SheRun #MondayMorning! What’s your excuse?
Great efforts in organising by @hydsheteam & @hydcitypolice
Santhi Kumari, IAS, @TelanganaCS, Anjani Kumar IPS @TelanganaDGP, @Shikhagoel_IPS, ADGP @ts_womensafety, & C.V. Anand@CPHydCity joined the run.#InternationalWomensDay2023 pic.twitter.com/RLZuwoVfKK— Telangana She Teams (@TS_SheTeams) March 6, 2023