Nadigar Sangam | కోలీవుడ్ నటుడు ధనుష్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. చెన్నైలోని సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (నడిగర్ సంఘం)కు రూ.కోటి విరాళం అందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తమిళ సినీ కళాకారులు కోసం సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (నడిగర్ సంఘం) కొత్త భవనాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో 2021లో శంకుస్థాపన చేసిన ఈ భవనం ఇప్పటికి నిర్మితమవుతుంది. అయితే ఈ భవనాన్ని నిర్మించడం కోసం నడిగర్ సంఘం విరాళాలు సేకరిస్తోంది. ఇప్పటికే తమిళ స్టార్ హీరోలు దళపతి విజయ్, కమల్ హాసన్లు రూ.కోటి విరాళంగా ఇచ్చారు. హీరో శివ కార్తీకేయన్ సైతం రూ.50లక్షలు అందించారు. ఇక తాజాగా ఈ లిస్ట్లో మరో స్టార్ హీరో చేరాడు. తమిళ అగ్ర నటుడు ధనుష్ నడిగర్ సంఘంకు రూ.కోటి విరాళం అందించారు. నడిగర్ సంఘం అధ్యక్షుడు, నటుడు నాజర్, కోశాధికారి కార్తీలకు ధనుష్ కోటి రూపాయల చెక్ను అందించాడు. ఈ సందర్భంగా నాజర్తో పాటు కార్తీ ధనుష్కు ధన్యవాదాలు తెలిపారు.
South Indian Artistes’ Association member – Actor Dhanush donated a sum of rupees 1,00,00,000/- (1Crore) from his personal fund towards the construction of New Nadigar Sangam Building. He presented the cheque to SIAA President Thiru. Nassar, Treasurer Thiru. Karthi, and… pic.twitter.com/IO4qHZWxUj
— Ramesh Bala (@rameshlaus) May 13, 2024
ఇక సినిమాల విషయానికి వస్తే ధనుష్ ప్రస్తుతం తెలుగులో కుబేరా అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. రష్మిక మందాన్న హీరోయిన్గా నటిస్తుంది. మరోవైపు తమిళంలో ధనుష్ స్వీయ దర్శకత్వంలో రాయన్ సినిమా తెరకెక్కుతుంది. ధనుష్ 50వ చిత్రంగా వస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, దుషార విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.