MLA Anirudh Reddy | కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిస్థితి ఎలా ఉందో సొంత పార్టీ ఎమ్మెల్యే చెప్పిన మాటలే మరోసారి రుజువు చేస్తున్నాయి. ప్రస్తుతం జనాలకు ఏ పని కావాలన్నా పైసలు కావాలని.. పైసా లేనిదే పని కావడం లేదంటూ కామెంట్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.
మంగళవారం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఈ రోజు పైసా పేక్ తమాషా దేక్ అన్నట్టు పరిస్థితి ఉంది.. ఎవరు పైసలు విసిరేస్తే వాళ్ల పనులవుతున్నయ్.. అని అన్నారు. అంతేకాదు నేను నిజంగా చెప్తున్నా పైసల్లేనోడు ఏ ఆఫీసుకు పోయినా కూడా పదిసార్లు తిరగాల్సి వస్తుందన్నారు. సొంత ప్రభుత్వంపైనే కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి.
సొంత ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో పైసా పేక్ తమాషా దేక్ నడుస్తుంది
పైసలు ఉన్నోడికి పనులు అవుతున్నాయి
పేదలు పనుల కోసం 10 సార్లు తిరగడం అవుతుంది – కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి pic.twitter.com/tNXe7qEy9x
— Telugu Scribe (@TeluguScribe) March 31, 2026
Prabhas | ఒకేసారి మూడు పాన్ ఇండియా చిత్రాలతో బిజీ.. ప్రభాస్ స్పీడ్కు ఇండస్ట్రీ షాక్!
Harish Rao | కేరళ ఎన్నికలు మీకు అవసరమేమో..? మాకు ప్రజా సమస్యలే ముఖ్యం : హరీష్ రావు
Leander Paes: బీజేపీలో చేరిన టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్