ఎదులాపురం, అక్టోబర్ 2 : మెప్మాలో విధులు నిర్వహిస్తున్న రిసోర్స్ పర్సన్స్(ఆర్పీ) వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై సంబురాలు చేసుకున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్న ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.
ఎమ్మెల్యేతోపాటు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2019లో రూ.4 వేలు, తాజాగా మరో రూ.2 వేల వేతనాన్ని పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. వేతనాలు పెంచడంపై ఆర్పీలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు స్వీట్లు తినిపించారు.