Cable Bridge | కొండాపూర్, ఫిబ్రవరి 19 : ఐటీ కారిడార్కు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మణిహారంగా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేబుల్ బ్రిడ్జి లైటింగ్ కోసం విదేశాల నుంచి ఎల్ఈడీ ప్రత్యేక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి, సందర్శకులను ఆకట్టుకునేలా చేశారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్య వైఖరితో కేబుల్ బ్రిడ్జి నిర్వహణను గాలికి వదిలేశారు.
కేబుల్ బ్రిడ్జి అందంగా కనిపించేలా ఏర్పాటు చేసిన లైటింగ్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు. ఎంతో ఖర్చు చేసి విదేశాల నుండి తెప్పించి ఏర్పాటు చేసిన లైటింగ్ వ్యవస్థని పట్టించుకోకపోవడంతో దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో కేబుల్ బ్రిడ్జి గత కొద్దిరోజులుగా లైటింగ్ లేక అంద విహీనంగా కనిపిస్తుంది. అయితే వాటి స్థానంలో అధికారులు ఫంక్షన్లలో ఉపయోగించే లైట్లను ఏర్పాటు చేశారు. దీంతో కేబుల్ బ్రిడ్జి లైటింగ్పై ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియోలు వైరల్గా మారాయి. ఇది ఆకర్షణీయమైన లైటింగ్ వ్యంస్థని కాదని, ఇదేమీ మోసం రా అంటూ ప్రభుత్వ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.
లైటింగ్ నీ దొంగలెత్తుకెళ్లారు…
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి లైటింగ్ సిస్టమ్పై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై విద్యుత్ శాఖ అధికారులను నమస్తే తెలంగాణ ప్రతినిధి వివరణ కోరగా… ఆశ్చర్య పోయే విషయాలు చెప్పారు. నిత్యం రద్దీగా ఉండే కేబుల్ బ్రిడ్జి లైటింగ్ సిస్టమ్ను ఒకటి కాదు రెండు సార్లు దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. దీనిపై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు సైతం చేసినట్లు చెప్పడం గమనార్హం.
టెండర్ ప్రక్రియ జరిగింది… మరో 10 రోజుల్లో ఏర్పాటు : విజయ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
కేబుల్ బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన లైటింగ్ సిస్టమ్లో ఉపయోగించే లైట్లు జపాన్ నుంచి రావాలి. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి అయింది. లైట్స్ విదేశాల నుంచి రావడానికి కొంచెం సమయం పడుతుంది. మరో పది రోజుల్లో వస్తాయి. ముందులాగా యధావిధిగా లైటింగ్ ఏర్పాటు చేస్తాం. కేబుల్ బ్రిడ్జి బీఆర్ఎస్ హయాంలో ఎలా ఉందో.. ఇప్పుడెలా ఉందో వివరిస్తూ షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
కేబుల్ బ్రిడ్జి లైటింగ్లో మోసం ఇలా..
Congress | కాంగ్రెస్ పార్టీ దురహంకారంతో ప్రవర్తిస్తున్నది : గండ్ర వెంకటరమణారెడ్డి
Afghanistan | ఎముకలు విరిగితేనే నేరమట.. గృహ హింసను చట్టబద్ధం చేసిన అఫ్గానిస్థాన్..!
‘మహిళల ఆర్థిక సాధికారతకు మహిళా సమాఖ్య సంఘాలు కీలకం’