హైదరాబాద్ : బహదూర్పురా వద్ద ఆరులైన్ల ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. మంగళవారం ఫ్లై ఓవర్ను ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా రూ.69 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఫ్లై ఓవర్ను నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్ని రూ.69 కోట్లతో నిర్మించారు. 690 మీటర్ల పొడువన.. ఆరు లేన్ల ఈ ఫ్లై ఓవర్.. బహదర్పురా వద్ద ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్గా మారనున్నది.
నెహ్రూ జులాజికల్ పార్క్ను సందర్శకులకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం కలిగించనున్నది. ఇదిలా ఉండగా.. పాతబస్తీలో పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ మంగళవారం శ్రీకారం చుట్టనున్నారు. మీరాలం చెరువు వద్ద మ్యూజికల్ ఫౌంటెన్, కాలాపత్తర్ పోలీస్స్టేషన్కు శంకుస్థాపన చేయనున్నారు. ముర్గీచౌక్ పునర్నిర్మాణానికి, మీరాలం మార్కెట్ పునర్నిర్మాణం, సర్దార్ మహల్ పనులకు, కార్వాన్ నియోజకవర్గంలో సీవరేజ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
Will be inaugurating the Bahadurpura flyover on 19th#SRDP #Hyderabad https://t.co/NklaNmkSGU
— KTR (@KTRTRS) April 17, 2022