TSPTA | రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వమే మధ్యాహ్న భోజనాన్ని అందించాలని రాష్ట్ర క్యాబినెట్లో సమావేశంలో నిర్ణయించడం మాకు ఆశ్చర్యాన్ని కలిగించిందని తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్పీటీఏ) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సయ్యద్ షౌకత్ అలీ, ఆర్ రోహిత్ నాయక్ తెలిపారు. ఎవరు మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని కల్పించాలని కోరారని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఉపాధ్యాయులకు కావాల్సింది, పాఠశాలలకు మౌళిక సదుపాయాలు, పూర్తి స్థాయిలో బోధన సిబ్బంది, పెండింగ్ లో ఉన్న ఆరు డిఏలు, మూడు సంవత్సరాల క్రితం అమలు చేయవలసిన పీఆర్సీని తక్షణమే అమలును కోరుకుంటున్నారని, వాటిని పక్కనబెట్టి ఎవరూ కోరుని విధంగా మధ్యాహ్న భోజనం ఇవ్వాలని ఆలోచన అశాస్త్రీయం.. అర్థ రహితం అని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్ డీఏలను మంజూరు చేయాలని.. పిఆర్సీలను ప్రకటించి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.