KTR | సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మీడియాలో, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వస్తే అవును తప్పకుండా (ఫ్యాక్ట్ చెక్) నిజాలను నిర్దారించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్లో బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్న సెమినార్లో ‘రాజ్యాంగం–ప్రజాస్వామ్యం–పత్రికా స్వేచ్ఛ’ అంశంపై కేటీఆర్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రగతి భవన్లో కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పెడితే 150 బెడ్రూమ్లున్నాయని ప్రచారం చేశారు..మరి ఇప్పుడక్కడ ఎవరుంటున్నారు..? ఉన్నాయా 150 బెడ్రూమ్లు. అందులో బంగారు కప్బోర్డులున్నాయన్నారు. ఆ ఫేక్ న్యూస్ వ్యాపింపచేసింది ఎవరు..? రూ.84 వేల కోట్ల ఖర్చయిన కాళేశ్వరం ప్రాజెక్టును రూ.లక్ష కోట్ల కుంభకోణమని ప్రచారం చేశారు. అది ఫేక్ న్యూస్ కాదా..? ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రశ్నించాలన్నారు.
ఫోన్ ట్యాపింగ్లో ఎవరో సినిమా యాక్టర్ల ఫోన్లు మీడియాను అడ్డం పెట్టుకుని ట్యాప్ చేశామని ప్రచారం చేశారు.. ఫోన్ ట్యాపింగ్లో నన్ను విచారణకు పిలిస్తే పోయాను. ఏ యాక్టర్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయి.. చెప్పు స్వామి కొద్దిగా నంబర్లు ఇయ్యమని అడిగా. ఎవరివీ కాలేదు సార్ అన్నడు. మరి ఎవరివీ కాకపోతే మీడియాకు చెప్పొచ్చు కదా ఇదేంది సోది అంటే.. చెప్పాను సార్ అని ఆ ఏసీపీ అన్నారు. ఎవరికి చెప్పారంటే ఆ పత్రికకు మాత్రం చెప్పానన్నారు.
ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మేం కూడా బాధితులమే.. అధికారంలో ఉన్నవాళ్లు మాత్రమే కాదని కేటీఆర్ పేర్కొన్నారు. నిజం గడప దాటేలోపే అబద్ధం అంగీ లాగేసుకుని ఊరంతా తిరిగి వచ్చేస్తుంది, ఇది వాస్తవం. అందరం బాధితులమే. ఇందులో కాదనడానికి ఏం లేదు. వాస్తవాలు వాస్తవాలే కదా.. జరుగనివి జరిగినట్టుగా ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా చూపిస్తున్నారన్నారు.
సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు
ప్రగతి భవన్లో 150 బెడ్రూమ్లు, బంగారు కప్బోర్డులు ఉన్నాయని ఫేక్ న్యూస్ ప్రచారం చేసింది మీరే కదా?
రూ.84 వేల కోట్ల ఖర్చయిన కాళేశ్వరం ప్రాజెక్టును రూ.లక్ష కోట్ల కుంభకోణమని ప్రచారం చేశారు. అది ఫేక్… pic.twitter.com/16al7XUGcj
— Telugu Scribe (@TeluguScribe) August 1, 2026