గోల్నాక, ఆగస్టు 22 : వందశాతం లక్ష్యంగా కొనసాగుతున్న స్పెషల్ కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రక్రియను వేగవంతం చేశామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బుధవారం గోల్నాక డివిజన్ గంగానగర్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్గౌడ్తో కలసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందితో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.