హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి(Prajavani) కార్యక్రమంలో మొత్తం 502 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 112 , మైనారిటీ వెల్ఫేర్కు సంబంధించి 71 పౌరసరఫరాల శాఖకు సంబంధించి 69 , పంచాయత్ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కు సంబంధించి 42 , మున్సిపల్ శాఖకు సంబంధించి 35 ఇతర శాఖలకు సంబంధించి 173 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా.చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేక అధికారి దివ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్ని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.