సాధారణంగా కిడ్నీలలో రాళ్లు ఉంటే.. ఒకటో రెండో ఉంటాయి. కానీ.. ఈ పేషెంట్కు మాత్రం ఎక్కువ సంఖ్యలో రాళ్లు ఉండటంతో ఆ వ్యక్తి శరీరంలో నుంచి రాళ్లను వెలికి తీయడానికి డాక్టర్లు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే.. ఆ వ్యక్తికి కిడ్నీ ఉండాల్సిన చోటు కన్నా పొత్తి కడుపు దగ్గర ఉండటమే. సాధారణంగా కిడ్నీలు మనిషి శరీరంలో మూత్రనాళానికి పైన ఉంటాయి. ఇతడికి పొత్తికడుపు దగ్గరికి ఉండటంతో.. అతడి కిడ్నీలో నుంచి రాళ్లను వెలికితీయడం డాక్టర్లకు సవాల్గా మారింది.
కర్ణాటకలోని హుబ్లీకి చెందిన స్కూల్ టీచర్ బసవ్రాజ్ మదివాలార్ వయసు 50 ఏళ్లు. అతడిని గత కొన్ని రోజుల నుంచి తీవ్రమైన కడుపునొప్పి వేధించేది. దీంతో హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఉన్న ప్రీతి యూరాలజీ ఆసుపత్రికి చెందిన యూరాలజిస్టులు సాధారణంగా చేసే కిడ్నీ ఆపరేషన్ కాకుండా.. లాపరోస్కోపీ చేశారు.
అతడి కిడ్నీ పొజిషన్ సరిగ్గా లేనందున.. కీహోల్ సర్జరీ చేసి అతడి కిడ్నీలో నుంచి 156 రాళ్లను తొలగించారు.
అతడికి గత రెండు మూడేళ్ల నుంచి కిడ్నీలో రాళ్లు పెరిగి ఉంటాయి. కానీ.. అతడికి ఎప్పుడూ అటువంటి లక్షణాలు కనిపించలేదు. గత కొన్ని రోజుల నుంచి కడుపునొప్పి వస్తుండటంతో ఆసుపత్రిలో చేరాడు. అతడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అతడికి లాప్రోస్కోపీ చేయాలనుకున్నాం. కిడ్నీలో నుంచి డైరెక్ట్గా రాళ్లను తీసేవిధంగా కీహోల్ సర్జరీ చేశాం. దాని కోసం ఎండోస్కోపీ రూట్ను ఏర్పాటు చేసి.. అందులో నుంచి రాళ్లను బయటికి తీశాం. సాధారణంగా అయితే కిడ్నీలో రాళ్లు తీయడానికి మేజర్ సర్జరీ చేయాల్సి ఉంటుంది.. అని ఆసుపత్రి ఎండీ, యూరాలజిస్ట్ చంద్రమోహన్ తెలిపాడు.
ఈ ఆపరేషన్ చేయడానికి 3 గంటలు పట్టింది. ఆపరేషన్ తర్వాత ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకోవాల్సి అవసరం కూడా రాలేదు. ఆ పేషెంట్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. తన ఉద్యోగానికి కూడా వెళ్తున్నాడు.. అని చంద్రమోహన్ స్పష్టం చేశాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Ectopic Pregnancy | వైద్యశాస్త్రానికే సవాల్.. మహిళ కాలేయంలో పెరుగుతున్న శిశువు
Omicron fears | కొవాగ్జిన్.. కొవీషీల్డ్.. వీటిలో బూస్టర్ డోస్గా ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది?
vNOTES | మహిళల కోసం.. మచ్చలేని శస్త్రచికిత్స
Health tips : ఈ సూపర్ ఫుడ్తో కిడ్నీలు పదిలం!
Health tips : ఈ ఆహారంతో అధిక రక్తపోటుకు చెక్!