ప్రాచీన భారతంలో సంప్రదాయ వంటకాల్లో కీలకమైన చిరు ధాన్యాలు ఆపై పలు కారణాలతో కనుమరుగవగా మళ్లీ భారత ఆహార ప్రధాన స్రవంతితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇవి అందరి ఆహారంలో భాగమవుతున్నాయి. ఆరోగ్య ప్రదాయినిగా పేరొందిన చిరుధాన్యాల వాడకాన్ని పెంపొందించేందుకు ఐక్యరాజ్యసమితి 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. తక్కువ నీటి వినియోగంతో తక్కువ విస్తీర్ణంలోనూ చిరుధాన్యాల సాగుకు అనుకూలం కావడంతో వీటి సాగు విస్తీర్ణం ఏటికేడు పెరుగుతున్నది.
భారత్లో తొమ్మిది రకాల చిరుధాన్యాలను సాగుచేస్తున్నారు. జొన్నలు, రాగులు, సజ్జలు, అరికెలు, సామలు వంటి ఎన్నో రకాలను పండిస్తున్నారు. మిల్లెట్స్ గ్లూటెన్ రహితమే కాకుండా వాటిలో అత్యధికంగా ఐరన్, క్యాల్షియంతో పాటు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
రక్తపోటు, మధుమేహంతో బాధపడేవారికి చిరుధాన్యాలు సరైన ఆహారమని ప్రముఖ పోషకాహార నిపుణులు (Health Tips)అమిత గాద్రె వెల్లడించారు. 100 గ్రాముల రాగిలో 344మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుందని ఇది బియ్యంలో కేవలం 33గ్రాములు కాగా, గోధుమల్లో కేవలం 30 మిల్లీ గ్రాములని చెప్పారు. చిరుధాన్యాలతో ఆహార ప్రయోజనాలివేనని పోషకాహార నిపుణులు చెబుతున్నారు..
బరువు తగ్గుదల
గ్లూకోజ్ లెవెల్స్ నియంత్రణ
గుండె ఆరోగ్యానికి మేలు
క్యాన్సర్ కణాలతో పోరాటం
కండరాల బలోపేతం
నిద్రలేమికి చెక్
రోగ నిరోధక శక్తి బలోపేతం
Read More
Health tips | రోజూ నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. ఎంతవరకు నిజం..?
Health Tips | నిత్యం ఆ పని చేస్తే అనారోగ్యం దరిచేరదట.. ఉల్లాసం ఉరకలేస్తుందట..!