Pain killers | తలనొప్పి, మెడనొప్పి, నడుమునొప్పి.. ఇలా చాలామందిని చాలా రకాల నొప్పులు వేధిస్తుంటాయి. నొప్పి కాస్త తీవ్రం కాగానే చాలామంది పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు. కానీ ఎడాపెడా అధిక మోతాదు కలిగిన పెయిన్ కిల్లర్లు వాడటం వల్ల వినికిడి లోపం తలెత్తే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
నొప్పులు తగ్గడం కోసం మనం సాధారణంగా వాడే ఇబూఫ్రొఫేన్, ఆస్పిరిన్లాంటివి ఈ సమస్యను తెచ్చిపెడుతున్నాయి. ఇలా మాత్రల కారణంగా చెవుడు రావడాన్ని ‘ఒటోటాక్సిసిటీ’ అని పిలుస్తున్నారు. నొప్పి మాత్రలతోపాటు యాంటిబయాటిక్స్, కీమోథెరపీ మందుల వల్ల కూడా వినికిడి లోపం తలెత్తుతుంది. అయితే కొన్నిసార్లు మాత్రలు ఆపేశాక నెమ్మదిగా వినికిడి శక్తి పెరిగే అవకాశం ఉంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం.. ఎడాపెడా మందులు వాడేవారి చెవిలో వినికిడికి దోహదం చేసే కాక్లియా దెబ్బతింటున్నది. ఇబూప్రొఫేన్ ఈ భాగానికి రక్త సరఫరాను మందగింపజేస్తుండటంతో అక్కడి కణాలు దెబ్బతింటున్నాయట. ఇకనుంచి నొప్పి మాత్రల్ని ఆచితూచి వేసుకోండి మరి!
వినికిడి సమస్యతో బాధపడేవారికి గుడ్న్యూస్”