National nutrition week | పోషకాహారలోపంతో చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. దేశ వ్యాప్తంగా ఈ సమస్య వెంటాడుతున్నది. ముఖ్యంగా చిన్నారులు, గర్భవతుల్లో పోషకాహార లోపం అధికంగా నమోదవుతున్నదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ఆరోగ్యంగా జీవించడానికి విటమిన్స్ సమృద్ధిగా ఉన్న ఆహారం చాలా కీలకం. చాలా మందికి పోషక విలువలపై అవగాహన లేక నిర్లక్ష్యం చేస్తున్నారు. కరోనా, డెంగీ లాంటి రోగాలు వచ్చినప్పుడు ఇమ్యూనిటీ లేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోషక విలువల ప్రాధాన్యతను తెలుసుకుని ఆరోగ్యంగా జీవించాలంటూ ఎన్ఐఏన్(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్) సెప్టెంబర్ నెలను ‘నేషనల్ న్యూట్రిషన్ మాసం’గా నిర్వహిస్తున్నది.
ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు ఇంట్లోనే తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది.ముఖ్యంగా విటమిన్లు లభించే ఫుడ్ను ప్రిఫర్ చేయాలి. విటమిన్-డీ, సీ,బీలను సమృద్ధిగా తీసుకోవాలి. వృద్ధులలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి వారికి రాగి జావ తాగించాలి. రోజువారి ఆహారంలో తాజా పండ్లు ఉండేలా చూసుకోవాలి. పసుపు నారింజ రంగులో ఉండే పండ్లు కొన్ని రకాలు ధీర్ఘకాలిక జబ్బులను నిరోధిస్తాయి. తాజాగా ఉండే పచ్చి కూరగాయలను, పండ్లను సలాడ్ రూపంలో తీసుకుంటే మంచిది. పోషకాహార ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
– సనా ఫాతిమా, న్యూట్రీషనిస్ట్, రివ క్లినిక్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పల్లెల్లో కంటే హైదరాబాద్లోనే ఎక్కువ అవుతున్న డయాబెటిస్ రోగులు.. ఎందుకంటే..
Child Health | మీ పిల్లలు నులిపురుగులతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా నివారించండి
Vaccines for children | మీ పిల్లలకు ఈ టీకాలు ఇప్పించారా?
Childhood obesity | ఆన్లైన్ క్లాసులతో లావెక్కుతున్న చిన్నారులు