న్యూఢిల్లీ : శరీరం సజావుగా పనిచేస్తూ శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే పోషకాహారం (Health Tips) విధిగా తీసుకోవాలి. ఆరోగ్యకర జీవనశైలితో వ్యాధులకు దూరంగా ఉండాలంటే సమతులాహారం తప్పనిసరి. పోషకాహార ప్రాధాన్యత వివరించేందుకు ప్రభుత్వం ఏటా సెప్టెంబర్ 1 నుంచి 7 వరకూ జాతీయ పోషకాహార వారోత్సవాలను (ఎంఎన్డబ్ల్యూ) నిర్వహిస్తోంది.
ఆరోగ్యకరమైన ఆహారంతో వ్యాధుల బారినపడటం తగ్గి నాణ్యతతో కూడిన జీవితం సొంతమవుతుంది. సమతుల పోషకాహారంతో దీర్ఘాయువు కూడా సొంతమవుతుంది. సమతులాహారంతో పాటు శారీరక వ్యాయామం ద్వారా మెరుగైన ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు. శరీరానికి అవసరమైన అత్యవసర పోషకాలు, విటమిన్లు, మినరల్స్ శరీరం తన విధులను సక్రమంగా నిర్వర్తించేందుకు అవసరం. పోషకాహారంతో రోగ నిరోధక వ్యవస్ధ బలపడటంతో పాటు, గుండె ఆరోగ్యం, జీర్ణవ్యవస్ధ మెరుగువుతుంది.
జీర్ణక్రియ సాఫీగా సాగడం, బరువు నియంత్రణ, మెదడు పనితీరు మెరుగవడం, రక్తపోటు, మధుమేహ నియంత్రణ, ఎముకలు, కండరాల బలోపేతం వంటి శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలకు పోషకాహారం అవసరం. పోషకాహారం శరీరానికి సక్రమంగా అందాలంటే ఈ ఆహారం తప్పకుండా మన డైట్ ప్లాన్లో చేర్చుకోవాలి.
పాలకూర
సాల్మన్ చేపలు
పెరుగు
బ్లూబెర్రీస్
క్వినోవా
బాదం
పప్పు ధాన్యాలు
స్వీట్ పొటాటో
చియా సీడ్స్
బ్రకోలి
Read More :