న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన అనంతరం వర్క్ ఫ్రం హోం, రిమోట్ వర్కింగ్ కల్చర్ను ( Remote Working) ఎంతోమంది జాబ్ ప్రొఫెషనల్స్ ఎంచుకుంటున్నారు. ఎక్కడి నుంచైనా పనిచేసే వెసులుబాటు ఉండటంతో పాటు పనివేళల్లో బాస్ పర్యవేక్షణ లేకపోవడం వంటి సానుకూలాంశాలతో ఈ విధానానికి పలువురు ఉద్యోగులు మొగ్గుచూపుతున్నారు. పలు టెక్ దిగ్గజాలతో పాటు ఎన్నో కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలికి ఉద్యోగులను వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయాలకు రావాలని కోరుతున్నా ఉద్యోగులు అందుకు సిద్ధంగా లేరు.
పలు కంపెనీలు విధిగా కార్యాలయాలకు రావాల్సిందేనని వార్నింగ్లు ఇస్తుండగా రిమోట్ వర్కింగ్కు అలవాటుపడిన పలువురు ఉద్యోగులు కంపెనీలకు రాజీనామాలు చేసేందుకూ వెనుకాడటం లేదు. మరోవైపు రిమోట్ ఉద్యోగుల కదలికలను పసిగట్టేందుకు కంపెనీలు సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నాయి. ఉద్యోగులను ట్రాక్ చేస్తున్న కంపెనీలు పని వేళల్లో వారు కంప్యూటర్లకు దూరంగా ఉన్నట్టు వెల్లడైతే అలాంటి ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఇటీవల ఓ ఆస్ట్రేలియన్ మహిళ రిమోట్ వర్కింగ్లో మూడు నెలల పాటు తన ల్యాప్టాప్పై సరైన యాక్టివిటీ చేపట్టలేదని గుర్తించిన కంపెనీ ఆమెను కన్సల్టెంట్ రోల్ నుంచి తప్పించింది.
ఆమె పనితీరును పరిశీలించేందుకు కంపెనీ కీస్ట్రోక్ మానిటరింగ్ సాఫ్ట్వేర్ను ఉపయోగించింది. ఆమె పోస్ట్కు గంటకు 500 కీస్ట్రోక్స్ అవసరం కాగా, ఆమె సగటు కీస్ట్రోక్స్ 100 కంటే తక్కువ ఉన్నాయని మేనేజర్ వివరించారు. వాస్తవానికి ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తూ మంచి ఫలితాలు అందిస్తే రిమోట్ వర్కింగ్తో ఉత్పాదకత పెరుగుతుంది. అయితే ఈ వర్క్ కల్చర్లో లోటుపాట్లను ఉపయోగించుకుని పలువురు ఉద్యోగులు పనిభారం నుంచి తప్పించుకోవడం వెలుగుచూస్తోంది. దీంతో ఆయా కంపెనీలు ఉద్యోగుల వర్క్ను, కీస్ట్రోక్స్ను పసిగట్టే సాఫ్ట్వేర్తో చెక్ చేయడంతో పాటు వెబ్క్యామ్స్ ద్వారా వారేం చేస్తున్నారనేదానిపైనా కన్నేస్తున్నాయి.
Read More :
Rishi Sunak | రిషీ సునాక్ కేబినెట్లో మరో భారత సంతతి మహిళ