న్యూఢిల్లీ : చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు (Health Tips) చుట్టుముడుతుంటాయి. ఈ సీజన్లో అనారోగ్య సమస్యలు వెంటాడకుండా ఇమ్యూనిటీని మెరుగుపర్చుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకర ఆహారంతోనే ఇమ్యూనిటీని బలోపేతం చేసుకోవచ్చని ప్రముఖ డైటీషియన్ అంజు మోహన్ చెబుతున్నారు.
జీవనశైలి, వయసు, ఒత్తిడి వంటి ఎన్నో అంశాలు ఇమ్యూనిటీని ప్రభావితం చేస్తాయి. చలికాలంలో తలెత్తే ఆరోగ్య సవాళ్లను ఐదు అంశాలతో అడ్డుకట్ట వేయవచ్చని అంజూ పేర్కొన్నారు. ప్రధానంగా మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు, మినరల్స్తో కూడిన సమతులాహారంతో పాటు పండ్లు, కూరగాయలతో కూడిన సమతులాహారం ఉండాలని చెబుతున్నారు.
రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సీ అధికంగా ఉండే సిట్రస్ పండ్లు, నట్స్, సీడ్స్లో ఉండే విటమిన్ ఈ అధికంగా ఉండే ఆహారం విధిగా తీసుకోవాలి. ఇక ఆరోగ్యకర ఆహారంతో పాటు రోజూ వ్యాయామం చేయడం తప్పనిసరి. వ్యాధులతో రోగనిరోధక వ్యవస్ధ దీటుగా పోరాడేందుకు అవసరమైన ఉత్తేజాన్ని అందించేలా శారీరకంగా చురుకుగా ఉండాలి. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. వింటర్లో ఇమ్యూనిటీ మెరుగ్గా ఉండాలంటే ఈ ఐదు సూచనలు పాటించాలని డైటీషియన్ అంజు మోహన్ సూచిస్తున్నారు.
పోషకాహారం
వ్యాయామం
తగినంత నిద్ర
హైడ్రేషన్
ఒత్తిడికి దూరం
Read More :