Health Tips : కిడ్నీలను దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పోషకాలతో నిండిన సమతులాహారం కీలకం. ఆహార నియమాల్లో చిన్నపాటి మార్పులతో కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. సోడియం, పాస్ఫరస్, పొటాషియంతో కూడిన ఆహారం అధికంగా తీసుకోవడం కిడ్నీలపై అదనపు భారం మోపుతుంది. ఇతర కాంప్లికేషన్స్ తలెత్తకుండా ఈ తరహా ఆహారాన్ని తగిన మోతాదు మించకుండా చూసుకోవాలి.
అధిక ప్రొటీన్ ఆహారం కూడా కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో మూత్రపిండాలపై పనిభారం పెంచుతుంది. ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు తీసుకుంటే వాటిలో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్ల కిడ్నీ పనితీరుకు ఊతమిస్తాయి. పండ్లు, కూరగాయలతో పాటు తృణధాన్యాలను తీసుకోవడం, బీపీ, శరీర బరువును అదుపులో ఉంచుకోవడంతో కిడ్నీ పనితీరు మెరుగవుతుంది.
విటమిన్స్, మినరల్స్తో కూడిన ఆహారం కిడ్నీలకు మేలు చేయడంతో పాటు రోజంతా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉండేందుకు ఉపకరిస్తాయి. ఇవి వాపు ప్రక్రియ నివారించి, రోగ నిరోధక వ్యవస్ధను ఉత్తేజితం చేస్తాయి. కిడ్నీ వ్యాధితో బాధపడేవారు పోషకాహారంతో పాటు సమతులాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కిడ్నీల ఆరోగ్యానికి పండ్లలో ముఖ్యంగా జామ, యాపిల్, పియర్, పపాయ, పైనాపిల్ తీసుకోవాలని చెబుతున్నారు. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ కిడ్నీలు దెబ్బతినకుండా కాపాడతాయి. ఇక ఐరన్, విటమిన్ కే వంటి కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పాలకూర, కేల్ వంటి ఆకుకూరలు తీసుకోవాలి. ఫైబర్ అధికంగా ఉండే బ్రౌన్ రైస్, క్వినోవా కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఫిష్, తోఫు వంటి లీన్ ప్రొటీన్ కిడ్నీ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Read More :
Crime news | కృష్ణజింక పుర్రెను అక్రమంగా తీసుకెళ్తూ పట్టుబడ్డ అమెరికన్..!