Weight Loss | బరువు తగ్గడం ఒక సవాలు. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, వ్యాయామం చేయాలి. ఆ ప్రయత్నంలో ఎండుద్రాక్ష, బెల్లం బాగా ఉపకరిస్తాయని చెబుతున్నారు నిపుణులు.
గోరు వెచ్చని నీటిలో 4-5 ఎండుద్రాక్షలను రాత్రంతా నానబెట్టాలి. ఉదయం లేవగానే పరగడుపున కొంత బెల్లం తినాలి. ఎండు ద్రాక్ష నానబెట్టిన నీళ్లను ఒక గ్లాసులో పోయాలి. అందులో అయిదు గ్రాముల బెల్లం కలిపి తాగాలి. రోజూ ఇలా చేయడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. కేలరీలు ఇట్టే కరుగుతాయి. దీంతో బరువు తగ్గుతారు. మరో పద్ధతి కూడా ఉంది. పొద్దునే, పెరుగులో 4-5 ఎండు ద్రాక్షలు కలపాలి. భోజనం తర్వాత ఆ పెరుగు తినాలి. ఇది పేగుల్లో జీర్ణక్రియ మెరుగుపడటానికి దోహదం చేస్తుంది.
ఎండుద్రాక్ష, బెల్లం.. సూపర్ ఫుడ్స్ జాబితాలోకి వస్తాయి. ఇవి రక్తపోటును తగ్గిస్తాయి. ఊపిరితిత్తులను శుభ్రం చేస్తాయి. ఎముకలను బలోపేతం చేస్తాయి. జీవక్రియను పెంపొందిస్తాయి. మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం, సెలీనియం, మాంగనీస్, ఐరన్, జింక్.. బెల్లంలో పుష్కలంగా ఉన్నాయి. ఇక ఎండుద్రాక్షలో పీచు పదార్థాలు ఎక్కువ. దీంతో తొందరగా ఆకలి కాదు. ఐరన్, పొటాషియం, క్యాల్షియం వల్ల జీవక్రియ చురుగ్గా సాగుతుంది. కాబట్టే, తొందరగా లావు తగ్గుతారు.
బెల్లం, ఎండుద్రాక్ష రెండూ బరువు తగ్గడానికి బాగా పనిచేస్తాయి. కాకపోతే మితంగా తినాలి. రెండిటిలో దేనిని అధికంగా తీసుకున్నా బరువు పెరుగుతారు. చక్కెర వ్యాధి ఉన్నా, ఇతర దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్నా డాక్టర్ల సూచన తప్పనిసరి.
“అధిక బరువుతో బాధపడుతున్నారా.. అయితే మీరు ఇవి తప్పక తినాలి..!”
“అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!”
“Weight Loss | బరువు తగ్గాలనుకుంటున్నారా..? రోజు ఈ చిట్కాలు పాటించండి..!”