పాన్గల్, ఏప్రిల్ 22 : మండలకేంద్రంలోని చౌకధర దుకాణంలో ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి ఎంఈవో లక్ష్మణ్నాయక్, టీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖర్నాయక్ గురువారం 25 కిలోల సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరో నా కాలంలో ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ.2 వేల నగదు, 25కేజీల బియ్యం పంపిణీ చేశారు. మండలంలో మొత్తం 57మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో వీఆర్ఏ సురేశ్, సివిల్ సైప్లె సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తకోటలో..
కొత్తకోట, ఏప్రిల్ 22 : ప్రైవేటు టీచర్లకు 25 కిలోల బియ్యం, రూ.2వేలు పట్టణంలోని మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని, తాసిల్దార్ వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కాలంలో ప్రైవేటు టీచర్లు ఇబ్బందుల్లో ఉండడంతో ప్రభుత్వం వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో 132మంది ప్రైవేట్ టీచర్ల్కు 25 కిలోల బియ్యంతోపాటు రూ.2వేల నగదును అందజేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్, కౌన్సిలర్లు సంధ్య, రవీందర్రెడ్డి, రామ్మోహన్రెడ్డి, తిరుపతయ్య, ఖాజామైనొద్దీన్, నారాయణమ్మ, రాములుయాదవ్, కోఆప్షన్ సభ్యులు వసీం, వహిద్, నాయకులు వినోద్, చాంద్పాషా పాల్గొన్నారు.