అలంపూర్: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం ఎమ్మెల్సీ వాణీదేవి అలంపూరు జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో వీరేశం,ఆలయ కమిటీ చైర్మన్ రవిప్రకాశ్గౌడ్, అర్చకులలు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అనంతరం వారు స్వామి, అమ్మ వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అలంపూరు మున్సి పల్ చైర్పర్సన్ మనోరమ, కౌన్సిలర్ సుష్మ, ఆలయ ధర్మకర్త వెంకట్రామయ్యశెట్టి, రమేశ్, వెంకటేశ్, శ్రీనివాసులు, రాజోలి నతనీయోలు, పాల్గొన్నారు.
అంతకు ముందు ఎమ్మెల్సీ వాణీదేవీకి అలంపూరు ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం ఘనస్వాగతం పలికారు. అదేవిధoగా రాయచూర్ రూరల్ ఎమ్మెల్యే బసప్పగౌడ బుధవారం కుటుంబ సమేతంగా ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు.