మహబూబ్నగర్ సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : టీఆర్ఎస్లో సంస్థాగత సందడి నెలకొన్నది. గ్రామ, మండల, పట్టణ, జిల్లా కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. దీంతో గ్రామాలు, పట్టణాల్లో గులాబీ జోష్ కొనసాగుతున్నది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రామ, పట్టణ కమిటీల ఏర్పాటు దాదాపుగా పూర్తయింది. 12వ తేదీలోగా గ్రామ, వార్డు కమిటీల ఎన్నికలు పూర్తయ్యాయి. ఈనెల 20లోగా మండల స్థాయి కమిటీలతోపాటు అనుబంధ సంఘాల కమిటీలను సైతం పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ జిల్లా అధ్యక్షుల ఎంపిక చేయనున్నా రు. ఈనెల 2నుంచి ప్రారంభమైన కమిటీల ఏర్పా టు ప్రక్రియలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు కీలకపాత్ర వహించారు. గ్రామాలు, వార్డుల్లో సమావేశాలు ఏర్పాటు చేసి కమిటీల నియామకాలను చేపట్టారు. గతంలో ఏ పార్టీ కమిటీలకు లేనంత పోటీ టీఆర్ఎస్ పార్టీ కమిటీలకు ఏర్పడింది. ఉద్యమ పార్టీయే అధికార పార్టీ కావ డం, ఉద్యమ నేతయే రాష్ర్టానికి ముఖ్యమంత్రి గా ఉండటం, అభివృద్ధిలో దూసుకుపోతున్న ప్రభు త్వం కావడం.. ఇలా అన్ని అంశాల్లోనూ టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే పార్టీ కోసం పనిచేసే ప్రతిఒక్కరూ తమవంతు పాత్ర పోషించేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు.
అన్ని వర్గాలకు ప్రాధాన్యం…
గ్రామ కమిటీల్లో ముఖ్యమైన కమిటీతోపాటు యువజన విభాగం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విభాగాలకు కమిటీలు వేశారు. ఇక అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు పార్టీ నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు తగు ప్రాతినిధ్యం ఉండాలని, వెయ్యిలోపు జనాభా ఉన్న గ్రామ కమిటీకి 11మంది సభ్యులు, అవరసరం ఉన్న చోట 15నుంచి 25మంది వరకు కమిటీల్లో అవకాశం కల్పించారు. క్రియాశీలక సభ్యులకే పదవులు ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి కమిటీలోనూ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, గ్రామ కమిటీల్లో అధ్యక్ష, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారితోపాటు మిగిలిన వారు కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. తొలిసారిగా సోషల్ మీడియా కమిటీలు సైతం గ్రామస్థాయి నుంచే వేయడం ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియా ప్రాధాన్యం పెరగడంతో గ్రామాల్లోనూ సంస్థాగతంగా సోషల్ మీడియా కమిటీలు కీలకపాత్ర వహించేలా పార్టీ నిర్ణయించింది. గ్రామాల్లో వాట్సప్ గ్రూపులు నిర్వహించడం, ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల ద్వారా పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఈ కమిటీలు ఉపయోగపడనున్నాయి.
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తా..
ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ఎన్నిక కా వడం సంతోషంగా ఉంది. తె లంగాణ ఉద్యమం నుంచి పా ర్టీలో చురుకుగా పనిచేశాను. పార్టీ నాయకులు గుర్తించి గ్రా మస్థాయిలో పార్టీ బాధ్యత అప్పగించారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తాను.
సంతోషంగా ఉంది..
టీఆర్ఎస్ పార్టీ హన్వాడ గ్రామాధ్యక్షుడిగా మూడుమార్లు ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చే స్తున్న పథకాలను ప్రజలకు వివరించి అర్హులందరికీ అందేలా చూస్తాను. అందరం సమిష్టిగా పనిచేసి ప్రభుత్వం, పార్టీ చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేస్తాం.
పనిచేసే వారికే పదవులు..
ఊహించని విధంగా టీఆర్ఎస్ పార్టీ పదవులకు ఈ సారి పోటీ నెలకొంది. అయితే పనిచేసే వారికే పదవులు లభించా యి. ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ను సంస్థాగతంగా బలపేతం చేయడం పార్టీ నేతలు, కార్యకర్తలుగా మా అందరిపై అతిపెద్ద బాధ్యతగా ఉంది. అందుకే పార్టీలో కీలకంగా పనిచేస్తున్న వా రికి గుర్తింపు లభించింది. గ్రామాలు, పట్టణాల్లో కమిటీలు వేయడం పూర్తయింది. ఈనెల 20 లో పు మండల కమిటీలు పూర్తి అవుతాయి. కమిటీ ల్లో అందరికీ సముచిత స్థానం లభించింది. పదవులు దక్కలేదని ఎవరూ నిరాశ చెందాల్సిన పనిలేదు. పనిచేసే వారికే గుర్తింపు వస్తుంది.