జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 18 : రెండు రోజులుగా తిండిలేక చెట్లపొదల్లో పడి ఉన్న ఓ యువకుడిని పోలీసులు దవాఖానకు తరలించి ఔదార్యం చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని బీఆర్.రెడ్డి ఫంక్షన్హాల్ సమీపంలోని చెట్లపొదల్లో శనివారం ఓ యువకుడు పడి ఉన్న విషయాన్ని తెలుసుకున్న పెట్రోలింగ్ పోలీసులు లింగం, తాహేర్బాబా అక్కడికి చేరుకుని పరిశీలించారు. వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించి అక్కడికి రప్పించారు. చెట్లపొదల్లో ఉన్న యువకుడిని చేరదీసి నీరు తాగించి జడ్చర్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చెట్లపొదల్లో పడి ఉన్న యువకుడు స్థానిక హౌసింగ్బోర్డుకాలనీకి చెందిన శేఖర్గా గుర్తించారు. అచేతన స్థితిలో ఉన్న యువకుడిని చేరదీసి దవాఖానలో చేర్పించిన పోలీసులను స్థానికులు అభినందించారు.