రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి
భూత్పూర్, ఏప్రిల్ 18 : యాసంగిలో పండించిన వరిధాన్యంలో తాలు, తేమ లేకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించారు. ఆదివారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో తూర్పారబడుతున్న ధాన్యాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ పండించిన పంటను విక్రయించేందుకు ఎవరూ ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వమే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదన్నారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామన్నారు. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలని సూచించారు. ధాన్యంలో నాణ్యత లోపిస్తే తరుగు తీస్తారన్న విషయాన్ని గమనించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చూస్తామని, రైతులు కూడా అధికారులకు సహకరించాలని సూచించారు.
మృతుడి కుటుంబానికి పరామర్శ
అన్నాసాగర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు ఖలీల్ శనివారం గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆల ఆదివారం మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఖలీల్ కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట కోఆప్షన్ సభ్యు డు ఖాజా, నాయకులు ఆల శశివర్ధన్రెడ్డి, రాజారెడ్డి, చెన్న య్య, షాకీర్, వెంకట్రాములు తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి
గొంతులో సమస్యా.. ఈ చిట్కా పాటిస్తే చిటికెలో మాయం..!
ప్యాసింజర్ వెహికల్స్ పల్టీ.. అది కరోనా మహిమ!