మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానోపాడు మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తాసీల్దార్ కార్యాలయంలో ఉన్న పాత కాస్రా పహణి, పాత ఆరోవార్ నకల్లతో పాటు 48 రకా లకు సంబంధించిన దస్ర్తాలు మొత్తం కాలి బూడిదయ్యాయి. వివరాల్లోకి వెళితే మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాల యంలో సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
విధుల్లో ఉన్న వీఆర్ఏలు గోపాల్, పార్వతమ్మలు కార్యాలయాన్ని శుభ్ర పరిచేందుకు చేరుకున్నారు. రికార్డు గదిలో నుం చి పొగలు రావడం చూసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న కంప్యూటర్ ఆపరేటర్ కార్యాలయానికి విద్యుత్తు సరఫరాను నిలిపివేశాడు. రికార్డు గదిని తెరిచి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే రికార్డు గది మొత్తం మంటలు వ్యాపించడంతో మంటలను అదుపు చేయడం సాధ్యం కాలేదు.
గద్వాల ఫైర్ స్టేషన్ నుంచి ఫైర్ ఇంజన్ 11గంటల ప్రాంతంలో వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. మధ్యాహ్నం 1 గంట తరువాత మంటలు అదుపులోకి రావడంతో గదిలో కాలిపోయిన దస్ర్తాలను బయటకు తీశారు. అప్పటికే దస్ర్తాలు మొత్తం కాలిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్డీవో రాములు ప్రమాద ఘటనపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
షార్ట్ సర్యూట్తో ఏమైనా ప్రమాదం జరిగిందా అని విద్యుత్తుశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్తు ప్రమా దం వల్ల ఈ ఘటన జరగలేదని సిబ్బంది ఆర్డీవోకు తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవాలని సీఐ వెంకటేశ్వర్లు ఎస్సై సంతోష్లను ఆర్డీవో రాములు ఆదేశించారు. మంటలను ఆర్పేందుకు స్థానిక ప్రజలు,సిబ్బంది,ఫైర్ సిబ్బంది, పోలీసులు శ్రమించారు.
ప్రమాదం ఎలా జరిగిందో అర్థం కావడం లేదు.తాసీల్దార్ వరలక్ష్మి
తాసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగిందని 9.30 గంటలకు సమాచారం వచ్చిందని హుటాహుటినా కార్యాలయంకు వచ్చేలోపు రికార్డు రూం మొత్తం మంటల్లో ఉంది. మా సిబ్బంది, పోలీసులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే 95 శాతం రికార్డులు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదం ఎలా జరిగిందో అర్థం కావడం లేదు.
ఘటనపై ప్రజల అనుమానాలు
తాసీల్దార్ కార్యాలయంలో అగి ప్రమాదం జరిగిన సంఘటనపై ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.ఇటీవల కొంత కాలం నుండి రికార్డులను పర్య వేక్షించే సిబ్బంది పని తీరు బాగా లేదని, వీఆర్ఎ నుంచి కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరూ రికార్డు గదిలోకి వెల్లి రికార్డులను తీసేవారని ఒక పద్దతి లేక పోవడం సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రజలు కార్యాలయం ఎదుట చర్చించుకున్నారు.