గద్వాల: కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం చేయూత నిస్తున్నదని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి చెప్పారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో కులాంతర వివాహాం చేసుకున్న నరేశ్, ఇందిర దంప తులకు ప్రభుత్వం తరపున వచ్చిన ప్రోత్సాహాకం రూ.2. 50 లక్షలను వారికి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులాంతర వివాహాం చేసుకున్న వారిని ఒక్కోసారి వారి కుటుంబాలు ఆదరించ వని అటువంటి సమయంలో ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని చెప్పారు. వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభు త్వం చేయూతనిస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందించిన ప్రోత్సాహాకం ద్వారా కులాంతర వివాహాం చేసుకున్నవారు ఉపాధి పొందాలని సూచించారు.
వారి ఉపాధి కోసమే ప్రభుత్వం నగదు అందజేస్తుందని చెప్పారు. ప్రభుత్వం అందించిన సాయా న్ని దుర్వినియోగం చేసుకుంటే కుటుంబం ఆర్థికంగా చితికిపోవడానికి అవకాశం ఉంటుందన్నారు. పెళ్లి చేసుకున్నవారు వారి కాళ్ల మీద వారు నిలబడడానికి ఈ సాయం తోడ్పాటు ఇస్తుందని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శ్వేత ప్రియదర్శిని, మున్సిపల్ చైర్మన్ బీఎస్, కేశవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, జడ్పీటీసీ రాజశేఖర్, కౌన్సిలర్లు మహేశ్, శ్రీను, సర్పంచ్ మన్యం, నాయకులు కురుమన్న, చెన్నయ్య, వంశీ, భాస్కర్, మధు తదితరులు పాల్గొన్నారు.