నవాబ్పేట, ఫిబ్రవరి 5 : మండలంలోని యన్మన్గండ్ల గ్రామ శివారులోని అయ్యప్ప కొండపై నిర్మించ తలపెట్టిన అయ్యప్ప ఆలయం మహాపుణ్యక్షేత్రంగా వెలుగొందేందుకు సహాయ సహకారం అందిస్తామని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. అయ్యప్ప కొండపై శనివారం అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన హోమ కార్యక్రమానికి వారు హాజరై భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయం నిర్మించాలనుకోవడం హర్షణీయమన్నారు. నిర్మాణానికి ముందుకొచ్చిన దాతలను వారు అభినందించారు. పూజల సందర్భంగా కొండపై అయ్యప్ప నామస్మరణ మార్మోగింది. గురుస్వాములు చంద్రమౌళి, వెంకటేశ్వరస్వామి పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, సింగిల్విండో చైర్మన్ నర్సింహులు, సర్పంచులు జయమ్మ హన్మంతు, గోపాల్గౌడ్, ఎంపీటీసీ రాధాకృష్ణ, ఉపసర్పంచ్ రఘువీర్, అయ్యప్ప సేవా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, రవికుమార్, గురుస్వాములు వెంకటేశ్, జనార్దన్, సతీష్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, నా యకులు నాగిరెడ్డి, లక్ష్మయ్య, అబ్దుల్లా, నవనీత్రావు, తెలుగు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.