జడ్చర్ల, మే 14 : మండలంలోని కిష్టంపల్లిలో శనివారం బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా రెండురోజులపాటు గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేశా రు. బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన సందర్భంగా గ్రామం లో పండుగ వాతావరణం నెలకొన్నది. గ్రామస్తులు కుటుంబసమేతంగా గ్రామదేవతను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
సాయంత్రం మహిళలు బోనాలతో ఊరేగింపుగా బొడ్రాయి వద్దకు చేరుకొని ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బోనాల ఊరేగింపులో చిన్నారుల కోలా టం, పోతరాజులు, శివసత్తుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో జెడ్పీ వైస్చైర్మన్ యాద య్య, సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రణీల్చందర్, సర్పంచులు రామకృష్ణారెడ్డి, ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, నాయకులు బచ్చిరెడ్డి, కొండల్, శ్రీను, రవీందర్రెడ్డి, అమర్నాథ్రెడ్డి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.