నెల్లికుదురు, జూన్ 2 : రైతులకు నకిలీ విత్తనాలు విక్ర యిస్తే షాపుల లైసెన్స్ రద్దు చేస్తామని డీఈవో ఛత్రునాయక్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని రైతువేదిక భవనం లో వ్యవసాయ అధికారి నెలకుర్తి రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ షాపు యజమానులతో సమావేశం నిర్వహించారు. బస్తాపై ముద్రించిన ధరకే విక్రయించాల న్నారు. అనంతరం మండల కేంద్రంలోని పలు షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏడీ లక్ష్మీనారా యణ, ఎస్సై పీ జితేందర్ పాల్గొన్నారు.
గూడూరులో…
గూడూరు: రైతులకు నకిలీ విత్తనాలు అమ్మొద్దని ఏవో రాకేశ్, ఎస్సై సతీశ్ విత్తన డీలర్లకు సూచించారు. మండ లంలోని పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యతలేని, కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
కొత్తగూడలో..
కొత్తగూడ : మండల కేంద్రంలో బుధవారం ఉన్నతాధి కారుల ఆదేశాల మేరకు పలు ఫర్టిలైజర్ షాపులను ఎస్సై సురేశ్, ఏవో ఉదయ్, ఏఈవో రాజు తనిఖీ చేశారు.
నకిలీ విత్తనాలు విక్రయించొద్దు
బయ్యారం : నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్ప వని గార్ల, బయ్యారం సీఐ తిరుపతి, ఏవో రాంజీ నాయక్ అన్నారు. మండలంలోని బయ్యారం, గంధంపల్లి, కొత్త పేట గ్రామాల్లోని పలు ఎరువులు, పురుగుమందుల షాపు లను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎస్సై జగదీశ్ , ఏఈవో సురేశ్ పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
పెద్దవంగర : రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్య లు తప్పవని మండల ఇన్చార్జి ఏవో కేఎస్ కుమార్ యాద వ్, ఎస్సై ఎస్కే రియాజ్పాషా హెచ్చరించారు. జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని పలు విత్తన దుకాణాల్లో బుధవారం తనిఖీలు నిర్వహించారు. కార్యక్రమంలో సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలు విక్రయించొద్దు
దంతాలపల్లి: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించొద్దని మండల వ్యవసాయ అధికారి కుమార్యాదవ్, ఎస్సై మురళీధర్రాజు అన్నారు. మండల కేంద్రంలోని పలు ఎరు వుల దుకాణాలను తనిఖీ చేసి, స్టాక్ రిజిస్టర్లు పరిశీలిం చారు. కార్యక్రమంలో ఏఈవోలు దీక్షిత్కుమార్, సందీప్, శిరీష పాల్గొన్నారు.
నకలీ విత్తనాలు అమ్మొద్దు
మరిపెడ : రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించొద్దని సీఐ సాగర్ అన్నారు. బుధవారం పట్టణంలోని పలు షాపుల్లో పోలీస్, టాస్క్ఫోర్స్, వ్యవసాయశాఖ అధికారుల తో కలసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. రైతులు షాపుల నుంచి రశీదు పొందాలని సూచించారు. రైతులకు అవగాహన కల్పించా లని ఎమ్మెల్యే రెడ్యా అధికారులను ఆదేశించారు.