నారాయణపేట టౌన్, మే 17 : పాలస్తీనా ప్రజలపై ఇ జ్రాయిల్ ఏకపక్ష దాడులను ఆపాలని పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు కాశీనాథ్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సబ్ డివిజ న్ నాయకులు కాళేశ్వర్ అన్నారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పట్టణంలోని సీ పీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయంలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ పాలస్తీనాను అన్యాయంగా, అక్రమంగా ఇజ్రాయిల్ తమ ఆధిపత్యంలో ఉంచుకోవడం కోసమే ఈ దు ర్మార్గానికి పాల్పడుతుందన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, తీవ్రంగా ఖండించాలన్నారు. ఐరాసా జోక్యం చేసుకొని పాలస్తీనీయులకు స్వతంత్య్ర దేశం ప్రకటించాలని డి మాండ్ చేశారు. కార్యక్రమంలో అరుణోదయ జిల్లా కోశాధికారి అంజి, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమా ర్, నాయకులు వివేక్, పీవైఎల్ నాయకులు నరసింహ, కృష్ణ పాల్గొన్నారు.
దురాక్రమణ దాడిని ఖండించాలి
ఊట్కూర్, మే 17 : పాలస్తీనా దేశాన్ని దురాక్రమణ పద్ధతిలో ఆక్రమించుకునేందుకు ఇజ్రాయిల్ ప్రయత్నిస్తోందని దీనిని ప్రతిఒక్కరూ ఖండించాలని సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కృష్ణ అన్నారు. సోమవారం బిజ్వారం శ్రామిక భవనంలో కొవిడ్ నిబంధనలమేరకు న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ రోజు పాలస్తీనాలోని అతి పెద్ద మసీదుపై ఇజ్రాయిల్ రాకెట్ దాడికి పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిలో మృతి చెందిన పాలస్తీనా పౌరులకు సంతాపం ప్రకటించారు. సామ్రాజ్యవాద దేశం అమెరికా అండతోనే ఇజ్రాయిల్ దాడికి పాల్పడి యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నదని, ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని దాడులను నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు సలీం, వెంకట్రెడ్డి, సిద్ధు, ఎల్లప్ప, గోవర్దన్రెడ్డి పాల్గొన్నారు.