అచ్చంపేట: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. మున్సిపాలిటీలో ఇప్పటివరకు 17 స్థానాల్లో ఫలితాలు వెలువడగా టీఆర్ఎస్ పార్టీ పదకొండు స్థానాల్లో విజయం సాధించింది. మున్సిపాలిటీలోని 2, 3, 4, 5, 12, 13, 15, 16, 17, 18 వార్డుల్లో అధికారపార్టీ గెలుపొందింది. 2వ వార్డులో నిర్మల, 3వ వార్డులో సోమ్లా నాయక్, 4వ వార్డులో ఆ పార్టీ అభ్యర్థి మిరాజ్ బేగం 116 ఓట్లతో, 5వ వార్డులో లావణ్య, 12వ వార్డులో ఖాజాబీ, 13వ వార్డులో శివకృష్ణ, 15వ వార్డులో మనోహర ప్రసాద్, 16వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి నరసింహ గౌడ్ తన సమీప అభ్యర్థిపై 405 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, 17వ వార్డులో శ్రీనివాసులు, 18వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు.
మున్సిపాలిటీలోని ఆరు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు 1, 7, 10, 11, 14 వార్డుల్లో గెలుపొందారు. ఒక వార్డులో బీజేపీ అభ్యర్థి గెలిచారు. అచ్చంపేటలోని జేఎంజే ఉన్నత పాఠశాలలో ఓట్లను లెక్కిస్తున్నారు. మున్సిపాలిటీలోని 20 వార్డులకు ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..