నిజామాబాద్: కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు పార్టీ దూసుకుపోతున్నది. ఇప్పటికే నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నది. ఇక మున్సిపల్ ఉపఎన్నికల్లో కూడా గులాబీ గుబాలించింది. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ 18వ వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి బెంజర్ గంగారాం విజయం సాధించారు. అదేవిధంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 12వ వార్డులో టీఆర్ఎస్ గెలుపొందింది. 12వ వార్డులో ఆ పార్టీ అభ్యర్థి నాయిని యాదగిరి 331 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..