హైదరాబాద్ హుస్సేన్ సాగర్ సమీపంలోని అంబేడ్కర్ నగర్లో నూతనంగా నిర్మించిన 330 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి, ఇండ్ల తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు స్థానిక మహిళలు బోనాలతో ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్ ఆడబిడ్డలతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. మురికివాడల్లో ఉన్న తమకు అద్భుతమైన ఇండ్లు నిర్మించి ఇవ్వడం సంతోషంగా ఉందని లబ్దిదారులైన మహిళలు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. లబ్దిదారుల ఆనందం చూస్తుంటే తన గుండె సంతోషంతో ఉప్పొంగి పోయిందని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పసిడి కాంతుల్లో యాదాద్రి ఆలయం.. ఎంపీ సంతోష్కుమార్ తీసిన ఫోటోలు ఇవే
Diabetes : షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
సూర్యగ్రహణం 2021: ప్రపంచవ్యాప్త బెస్ట్ పిక్