న్యూఢిల్లీ: ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్, తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపికి బీబీసీ భారత స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయర్ 2020 అవార్డు దక్కింది. హంపితో పాటు రెజ్లర్ వినేశ్ ఫోగట్, స్ప్రింటర్ ద్యుతీచంద్, షూటర్ మను బాకర్, భారత హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ను అవార్డు కోసం 40 మంది సభ్యుల జ్యూరీ నామినేట్ చేసింది. అయితే అభిమానుల నుంచి అత్యధిక ఓట్లు పొందిన హంపికి అవార్డు దక్కింది. ఈ పురస్కారం తనతో పాటు చెస్ ప్రపంచానికి ఎంతో అమూల్యమైనదని హంపి చెప్పింది. అలాగే 2020కి గాను బీబీసీ జీవిత సాఫల్య పురస్కారం భారత వెటరన్ అథ్లెట్ అంజూ బాబీ జార్జ్కు దక్కింది.