చండ్రుగొండ: విష జ్వరంతో యువకుడు మృతి చెందిన సంఘట గురువారం మండలంలో చోటు చేసుకుంది. తిప్పనపల్లి గ్రామానికి చెందిన ఆకుల ధనుష్(18) గత మూడు రోజుల క్రితం జ్వరంతో కొత్తగూడెం ప్రవేటు ఆసుపత్రిలో చేరాడు. అక్కడ ప్లేట్లేట్స్ తగ్గి పరిస్థితి విషమించటంతో ఖమ్మం తరలించి ప్రవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం మృతి చెందాడు. గురువారం తిప్పనపల్లి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి తండ్రి ఆకుల శ్రీనివాస్రావు డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన యువకుడు విషజ్వరంతో మృతి చెందడంతోపాటు, తండ్రి డెంగ్యూతో బాధపడుతుండటంతో ఆ కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి.